NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

1 min read

ఎమ్మిగనూరు, న్యూస్​ నేడు:     పట్టణంలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్  శ్రీమతి బుట్టా రేణుక  ఆదేశాల మేరకు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వీరశైవ లింగాయత్ అధ్యక్షులు వై. రుద్రగౌడ్  ఆధ్వర్యంలో, పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప  అధ్యక్షతన  పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.వేడుకలలో భాగంగా పార్టీ కార్యాలయం వద్ద వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.  కేక్ కట్  వెయ్యడం జరిగింది. అనంతరం వైయస్ఆర్  కూడలిలో వైయస్ రాజశేఖర్ రెడ్డి  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, పార్టీ సేవల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని , పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ, ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  వై. రుద్రగౌడ్  మీడియాతో మాట్లాడుతూ, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన వెనుక ఉన్న ప్రజా సంక్షేమ లక్ష్యాలను, పార్టీ ప్రస్థానాన్ని వివరించారు. “వైయస్ జగన్  నవరత్నాల రూపంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందించారు. సామాజిక న్యాయాన్ని నెలకొల్పుతూ, అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపించారు” అని ఆయన పేర్కొన్నారు.2011లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి  వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపన రోజు నుంచే ప్రజా సంక్షేమాన్ని కేంద్రంగా పెట్టుకుని ప్రజలకు అండగా నిలుస్తూ పోరాటం చేస్తోంది. రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతూ, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటమే పార్టీ ప్రధాన లక్ష్యం.2019లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి భూకంప విజయాన్ని నమోదు చేసింది. వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రతి వర్గానికి ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధిని సాధించారు.

అమ్మ ఒడి – విద్యను ప్రోత్సహించేందుకు తల్లులకు రూ. 15,000 ఆర్థిక సహాయం.ఆరోగ్య శ్రీ – పేదలకు మెరుగైన వైద్యం కోసం రూ. 5 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు.రైతు భరోసా – రైతులకు ఏడాదికి రూ. 13,500 ఆర్థిక సహాయం.చేయూత – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆర్థిక అభివృద్ధికి నేరుగా డబ్బులు జమ.వైఎస్సార్ ఆసరా – మహిళా సంఘాలకు రుణాల మాఫీ ద్వారా ఆర్థిక స్వావలంబన.వైఎస్సార్ హౌసింగ్ – గృహ నిర్మాణం ద్వారా లక్షల కుటుంబాలకు ఇల్లు.నాడు-నేడు – ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక.వైఎస్సార్ పింఛన్ కానుక – వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు నెల నెలా ఆర్థిక సహాయం.వైఎస్సార్ కాపు నేస్తం – కాపు వర్గానికి ఆర్థికంగా చేయూత.సున్నా వడ్డీ రుణాలు – మహిళలకు, రైతులకు, చిన్న వ్యాపారస్తులకు సున్నా వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక ప్రోత్సాహం.వైఎస్సార్ వసతి దీవెన – కళాశాల విద్యార్థులకు హాస్టల్ ఫీజు భర్తీ.వైఎస్సార్ విద్యా దీవెన – విద్యార్థుల చదువుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్.జగనన్న గోరుముద్ద – ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పోషకాహారం అందించే పథకం.జగనన్న వసతి దీవెన – పేద విద్యార్థులకు వసతి సౌకర్యాల కోసం ఆర్థిక సహాయం.ఈ పథకాలన్నీ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకువచ్చాయి. ప్రతి ఒక్క వర్గానికి సహాయంగా నిలిచిన వైయస్ జగన్ ప్రభుత్వం, పేద ప్రజలకు స్వాభిమానం, ఆత్మగౌరవాన్ని అందించింది.ఈ కార్యక్రమంలో  వైయస్ఆర్ సిపి రాష్ట్ర/జిల్లా/నియోజకవర్గ /మండల/పట్టణ/గ్రామ అనుభంద విభాగాల కమిటీ సభ్యులు,మునిసిపల్  వైస్ చైర్మన్,కౌన్సిలర్లు,ఇంచార్జులు,మండల కన్వీనర్లు,సర్పంచులు,ఎంపీటీసీ లు,నాయకులు కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *