PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్సార్​ కాపునేస్తం మహిళలకు వరం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : వైఎస్సార్​ కాపు నేస్తం మహిళలకు వరం లాంటిదని రాయచోటి ఎంపిడిఓ సురేష్ బాబు పేర్కొన్నారు. గురువారం సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి వర్చువల్ కార్యక్రమంలో భాగంగా వై.యస్.ఆర్ కాపు నేస్తంను ప్రారంభించారు. వై ఎస్ ఆర్ జిల్లా కు సంబంధించి జిల్లా కలెక్టరు అదేశముల మేరకు రాయచోటి మండల పరిషత్తు కార్యాలయంలో మండలంలోని 9 గ్రామాలలోని 115 మంది కాపు నేస్తం లబ్దిదారుల కు రూ.17,25,000 లు బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయని మండల పరిషత్ అభివృద్ధి అధికారి తెలిపారు. సమావేశములో మెగా చెక్కును మాజీ ఎంపీ పీ మండల నాయకులు పోలు సుబ్బారెడ్డి చేతులమీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో బిసి నాయకులు పల్లపు రమేష్ గారు,శ్రీనివాసులురెడ్డి మరియు మండలంలోని సర్పంచులు,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author