PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్సార్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణం లోని నెహ్రూ విద్యా సంస్థలలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఉపాధ్యాయుల,పట్ట భద్రుల శాసన మండలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఉపాధ్యాయుల శాసన మండలి సభ్యునిగా వైయస్సార్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా రామచంద్ర రెడ్డి గారిని, పశ్చిమ రాయలసీమ పట్ట భద్రుల శాసన మండలి వైయస్సార్ పార్టీ అభ్యర్థిగా వెన్న పూస రవీంద్రా రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఉపాధ్యాయులను కోరారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పునర్ వైభవం తీసుకురావడం జరిగిందని అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని చెప్పారు. ఎన్నడూ లేని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికతో పాటు హాజరు శాతం కూడా పెరగడం జరిగిందని అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకువచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అలాగే 36 ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి రామచంద్ర రెడ్డి గారిని అలాగే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల వైయస్సార్ పార్టీ బలపరిచిన శాసనమండలి అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం జగనన్నకు కానుకగా ఇవ్వాలని చెప్పారు. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు ఉన్న సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధాన అమలు చేయడంలో మరియు ఉమ్మడి సర్వీసులు సమస్య పరిష్కరించి పర్యవేక్షణ పోస్టులైన ఎంఈఓ, డిప్యూటీ ఇఓ, డైట్, ఎస్సీఈఆర్టీ లలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీ మరియు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేయుచున్న స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చలర్స్ గా పదోన్నతులు ఇప్పించడం, మున్సిపల్ ఉపాధ్యాయులకు జిపిఎఫ్ సౌకర్యం, పదోన్నతులు, బదిలీలు ఇతర సమస్యలు పరిష్కారంలో మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్ర రెడ్డి గారు అవిరాల ఖుషి చేస్తున్నారని సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అయ్యేటట్లు తాను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్తానని ఇవే కాకుండా విద్యా, ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ఉద్యోగంలో తలెత్తే వ్యక్తి పరమైన సమస్యలను కూడా పరిష్కరించడానికి ఎంపీ రామచంద్ర రెడ్డి గారు తన వంతు కృషి చేస్తారని అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలని చెప్పారు.పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల వైయస్సార్ పార్టీ శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస రవీంద్రారెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంతో ముడిపడి విద్యార్థి దశలోనే రాష్ట్రస్థాయి నాయకుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగిందని విద్యారంగ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు చేయడం జరిగిందని చెప్పారు. ఉన్నతవిద్య పూర్తి చేసి హైకోర్టు న్యాయవాదిగా నిరుద్యోగ, ఉద్యోగుల కేసులను వాదించడం జరిగిందని పేదల న్యాయవాదిగా పేరు తెచ్చుకోవడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా రాప్తాడు మండల జడ్పిటిసిగా గెలిచి ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారని అలాంటి వ్యక్తి మనకు శాసనమండలి అభ్యర్థిగా గెలుస్తే శాసన మండలి సభలో మన గళం ను వినిపించ గలుగుతారని చెప్పారు. అలాంటి వ్యక్తిని కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాలని పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నెహ్రూ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కోడూరు రవి తేజ రెడ్డి,విద్యా సంస్థల కరస్పాండెంట్ కోడూరు కమల్ తేజా రెడ్డి,జిల్లా వైయస్సార్ పార్టీ యువజన సంఘం.అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి,అంబటిరవిరెడ్డి,ఈశ్వర్నాయక్,శ్రీనివాసులు,నారాయణ మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

About Author