NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అలసిన బతుకులకు భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక

1 min read

80 హోళగుంద రూ.3 వేలకు పెంచిన పెన్షన్లు పంపిణీ

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : జీవితంలో ఎన్నో కష్టాలు చూసి అలసిపోయిన బతుకులకు సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో భరోసా కల్పించారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి  అన్నారు.హోళగుంద మండలం  లోని 80 కొత్త మంజూరు అయిన రూ.3వేలకు పెంచిన పెన్షన్లను గుమ్మనూరు నారాయణ స్వామి   పంపిణీ చేశారు.  లబ్దిదారులకు పెంచిన పెన్షన్లను స్వయంగా అందజేశారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ .. పెన్షన్ ను రూ.3 వేలకు పెంచారన్నారు.పెరిగిన పెన్షన్ల వల్ల అవ్వాతాతలకు మంచి జరుగుతుందన్నారు.పెన్షన్ పెంపుతో లబ్దిదారుల కళ్లలో ఆనందం కనిపిస్తోందన్నారు. రాష్ట్రాన్ని సీఎం శ్రీ వైఎస్ జగన్  అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నానన్నారు.ఆలూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగున్నరేళ్లలో అభివృద్ధి చేశామన్నారు.మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారన్న నమ్మకం తనకుందన్నారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author