PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ఆర్ షాదీ తోఫా పేదలకు వరం

1 min read

పల్లెవెలుగు వెబ్​ మిడుతూరు: వైయస్సార్ కళ్యాణమస్తు మరియు వైయస్సార్ షాదీ తోఫా కళ్యాణమస్తు పథకాలు పేదలకు వరమని ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి అన్నారు.మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామానికి చెందిన మొల్ల రహమత్ బీ కూతురు మల్ల అబిదాబి కి గతంలో వివాహం జరిగినది.వివాహానికి ముందుగా వీరు షాదీ తోఫా పథకానికి  దరఖాస్తు చేసుకున్నారు.దరఖాస్తు చేసుకున్నందుకు గాను వైయస్సార్ షాదీ తోఫా కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఒక లక్ష రూపాయలు నగదు వధువు తల్లి అయిన మొల్ల రహమత్ భీ అకౌంట్లో నగదు జమ అయినదని పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డి అన్నారు. అందుకుగాను నాగలూటి  సచివాలయంలో పైపాలెం సర్పంచ్ మర్రి రామచంద్రుడు,ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి, ఉపసర్పంచ్ మర్రి రామకృష్ణ లక్ష రూపాయలు నగదు జమ అయిన పత్రాన్ని వారికి అందజేశారు.ఈకార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

About Author