PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్ఆర్ షాదీ తోఫా, కల్యాణమస్తూ చెక్కులు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని జై కిసాన్ పార్కు నందు మున్సిపల్ చైర్మన్  దాసి సుధాకర్ రెడ్డి , మున్సిపల్ కమీషనర్  పి.కిషోర్  ఆధ్వర్యంలో బుధవారం  వైయస్ఆర్ షాదీ తోఫా, కల్యాణమస్తూ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రవేశ పెట్టిన వైయస్ఆర్ కల్యాణమస్తూ, షాదీ తోఫా పేద, మధ్య తరగతి కుటుంబాలకు వరం అన్నారు.పేద కుటుంబాలకు అండగా నిలిచిన జగనన్న, వారి భవిష్యత్తు ని దృష్టిలో ఉంచుకొని కనీస అర్హత 10వ తరగతి ప్రామాణికం చేయడం ద్వారా అక్షరాస్యత పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ జోనల్ ఇంచార్జ్ అబూబక్కర్, కౌన్సిలర్ లు అబ్దుల్ హామీద్, చాంద్ భాష, అబ్దుల్ రవూఫ్, మనపాడు అశోక్, లాలు ప్రసాద్, రజిని కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కురవ శ్రీను, రవింద్రా రెడ్డి, బ్రహ్మయ్య ఆచారి తదీతరులు పాల్గొన్నారు.

About Author