PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్ఆర్సీపీ పార్టీలో మహిళలకు పెద్దపీట

1 min read

– ఉమ్మడి కర్నూలు జిల్లా మహిళా విభాగం జోనల్ ఇన్చార్జిగా.. 41 వ వార్డు కార్పొరేటర్ శ్వేతా రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కల్లూరు: వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూల్ జిల్లా మహిళా విభాగం జోనల్ ఇంచార్జిగా పాణ్యం నియోజకవర్గంకు చెందిన 41 వార్డ్ కార్పొరేటర్ శ్వేతా రెడ్డి నీ నియమించారు ఈ సందర్భంగా బుధవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి శ్వేతా రెడ్డి దంపతులను శాలువాతో మరియు పూల మాల తో సన్మానం చేశారు రానున్న రోజుల్లో పార్టీలో మరెన్నో పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం సోషల్ మీడియా కో కన్వినర్ ప్రవీణ్ కుమార్, కర్నూల్ కార్పొరేషన్ సోషల్ మీడియా కన్వినర్ డేవిడ్ శేషు, భరత్ రెడ్డి, మరియు బెస్తా ప్రవీణ్ పాల్గొన్నారు.

About Author