PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్ట్-2

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించేందుకు ఎల్లవేళలా కృషిచేసే ఛానల్ జీ తెలుగు. నటీనటుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరంవలె 2023 సంవత్సరానికిగానూ ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ తారలు, బుల్లితెర నటీనటుల మధ్య అంగరంగ వైభవంగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఉత్సవాన్ని నిర్వహించింది. మహిళల ప్రాధాన్యత ఇనుమడించేలా ప్రత్యేకమైన పింక్ కార్పెట్, జీ తెలుగు కుటుంబం అవార్డుల ప్రధానోత్సవం పార్ట్- 1 ప్రేక్షకులను అలరించింది. ఇక, ఈ మెగా ఈవెంట్ పార్ట్-2ను ఈఆదివారం మీముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునే ప్రదర్శనలు, హృదయాన్ని తాకే క్షణాలు, మరపురానిఅనుభవాలతో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్స్ అయిన ప్రదీప్ మాచిరాజు-రష్మీ గౌతమ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇక, ఈ సందర్భంగా సీరియల్స్, జీ తెలుగు కుటుంబంపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. నేచురల్ హీరో నాని రాకతో కార్యక్రమం మరింత సరదాగా మారింది. ప్రముఖ యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని ఈ అవార్డు వేదికపైనే జరుపుకున్నారు. వీరి ప్రేమ కథకు ప్రేక్షకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ద్రౌపదిగా నయని నటన, రష్మీ, కావ్య కళ్యాణ్ రామ్ ల అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఉత్తమ యాంకర్, ఎవర్ గ్రీన్ కపుల్, పాపులర్ మేల్ ఫేస్ వంటి అవార్డులతో పాటు మరిన్ని అవార్డులతో నటీనటులను సత్కరించింది జీ తెలుగు. సరదాగా సాగిన ఈ కార్యక్రమానికి బుల్లితెర నటీనటులతోపాటు టాలీవుడ్ తారలు, ప్రముఖులు హాజరై మరింత కళను జోడించారు. నవంబర్ 5న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే జీ కుటుంబం అవార్డ్స్ పార్ట్-2లో నైట్ ఆఫ్ గ్లిట్జ్ అండ్ గ్లామర్ ను సెలబ్రేట్ చేసుకుంది.అంగరంగ వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ తారలు సంయుక్త మీనన్, సుహాస్, పాయల్ రాజ్పుత్, తరుణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

About Author