NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూడ్నెళ్ల‌కోసారి.. డెలివ‌రీ బాయ్ గా జొమాటో సీఈవో !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ప్రముఖ డెలివరీ యాప్ గా పేరొందిన సంస్థ జొమాటో. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ, పట్టణాల్లోనూ జొమాటో సేవలు విస్తరించాయి. ఈ సంస్థకు దీపిందర్ గోయల్ సీఈవో. ఆయన గురించి నౌఖరీ డాట్ కామ్ అధినేత సంజీవ్ భిఖ్ చందానీ ఆసక్తికర అంశం వెల్లడించారు. దీపిందర్ గోయల్ ప్రతి మూడు నెలలకు ఓసారి డెలివరీ బాయ్ అవతారం ఎత్తుతాడని తెలిపారు. రోజంతా ఆర్డర్లు డెలివరీ చేస్తారని పేర్కొన్నారు. గోయల్ జొమాటా బ్రాండ్ నేమ్ తో కూడిన ఎర్ర రంగు టీషర్టు ధరించి, బైక్ పై తిరుగుతూ స్వయంగా డెలివరీలు ఇస్తారని వివరించారు. ఇటీవల గోయల్ తో మాట్లాడిన సందర్భంగా ఈ విషయం తెలిసిందని భిఖ్ చందానీ వెల్లడించారు. ఇది గత మూడేళ్లుగా జరుగుతోందని తెలిపారు. అంతేకాదు, ఇప్పటివరకు తనను ఎవరూ గుర్తుపట్టలేదని దీపిందర్ గోయల్ చెప్పినట్టు భిఖ్ చందానీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

                                   

About Author