PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైనార్టీ నేతను పరామర్శించిన జెడ్పీటీసీ

1 min read

పల్లెవెలుగు  వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందిన మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు మొల్ల సమీముల్ల తండ్రి వైసీపీ మైనారిటీ సీనియర్ నాయకులు మొల్ల అబ్దుల్ ముజీబ్(75)గత మూడు వారాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారు.విషయాన్ని తెలుసుకున్న మిడుతూరు మండల జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి శుక్రవారం ఉదయం వారి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.అదేవిధంగా మీరు త్వరగా కోలుకోవాలని మీరు గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారని ఆరోగ్యం కుదుట పడి ప్రజలకు సేవలు అందించాలని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మొల్ల షఫీ,మాజీ ఎంపీటీసీ సుబ్బన్న,గ్రామ వైసీపీ మైనారిటీ నాయకులు ఆనర్ భాష,ఉప్పల దడియ ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author