PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రికెట్ పోటీలను ప్రారంభించిన జడ్పీటీసీ యుగంధర్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి సోమవారం ఉదయం పోటీలను ప్రారంభించారు.మీలో ఉన్నటువంటి ప్రతిభను ఆటల పోటీలలో కనబరచాలని యువకులకు జడ్పిటిసి యుగంధర్ రెడ్డి సూచించారు.ఈ క్రికెట్ పోటీలలో మొత్తం 45 జట్లు పాల్గొంటున్నాయని ఆర్గనైజర్లు సోమశేఖర్ రెడ్డి,కోటేశ్వర్ రెడ్డి,సురేష్ కుమార్,శరత్ తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపీటీసీ నాగేశ్వర రెడ్డి,సొసైటీ చైర్మన్ తులసి రెడ్డి,వైస్ ఎంపీపీ టి.నబి రసూల్ వైసీపీ మండల కన్వీనర్ తువా లోకేశ్వర రెడ్డి,మల్లు శివ నాగిరెడ్డి,శేషిరెడ్డి,మల్లేశ్వర రెడ్డి మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

About Author