PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

1 min read

రూ.37,310 నగదు స్వాధీనం
పల్లెవెలుగువెబ్​, రాయచోటి/వీరబల్లి : వీరబల్లి మండల పరిధిలోని పుత్తవాండ్ల పల్లె, మట్లి అసాది వాండ్ల పల్లెలో శుక్రవారం ఎస్ ఐ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో పేకాట శిబిరంపై మెరుపు దాడి చేశారు. దాడిలో 10 మంది జూదరులలు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.37,310 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మహమ్మద్​ రఫి మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author