ప్రజలతో సభ్యతగా వ్యవహరించండి
1 min read

పల్లెవెలుగువెబ్, చాగలమర్రి: సచివాలయాలకు వచ్చే ప్రజలతో సచివాలయాల సిబ్బంది సభ్యతగా వ్యవహరించాలని ఎంపిడీఓ షంషాద్బాను కోరారు. చాగలమర్రి పట్టణంలోని రెండు,మూడవ సచివాలయాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎంపిడీఓ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ తప్పని సరి అన్నారు.

