15 లీటర్ల నాటు సారా స్వాదీనం..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ కర్నూలు వారి ఆదేశముల మేరకు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్, సబ్-ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందితో కలిసి కాల్వ గ్రామం శివారు లో ఎక్సైజ్ నేరముల నిమిత్తము వాహనాల తనిఖీ చేయుచుండగా గుడుంబాయి తాండ కు చెందిన టి.నాగేంద్ర నాయక్ మోటారు సైకిల్ పై నాటు సారాయిని కాల్వ గ్రామంకు తీసుకొస్తుండగా, పట్టుకోవడం జరిగినది. సదరు మోటార్ సైకిల్ ను పరిశీలించగా ఒక బ్యాగ్ నందు 15 లీటర్ల నాటు సారాను స్వాదీనము చేసుకొని, సదరు మగ వ్యక్తి ని అదుపులోకి తీసుకొని, కేసును నమోదు చేసి,సదరు ముద్దయిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించడమైనది అని కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే.చంద్రహాస్ తెలిపారు. ఈ దాడులలో కర్నూల్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ కె.నవీన్ బాబు మరియు కానిస్టేబుల్ సిబ్బంది రంగయ్య, మురహరి రాజు, ఈరన్న, సూర్య నారాయణ మరియు రామలింగయ్య పాల్గొన్నారు అని తెలిపినారు. నాటు సారా తయారు చేయడం అమ్మడం మరియు రవాణా చేయడం చట్టరీత్యా నేరమని తెలుపుతూ ప్రతి ఒక్కరు నాటు సారాకు దూరంగా ఉండాలని తెలియజేయడం అయినది.