PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైస్కూల్ ప‌రిధిలోకి 3,4,5 త‌ర‌గ‌తులు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టిన పాఠశాల విద్యాసంస్కర‌ణ‌ల్లో భాగంగా 3,4,5 త‌ర‌గ‌తుల‌ను హైస్కూల్ ప‌రిధిలోకి తేవాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర‌కు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ త‌ర‌గ‌తుల్లోని విద్యార్థుల సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా వారికి ఉన్నత బోధ‌న అందించేందుకు ఈ చ‌ర్యలు చేప‌ట్టింది. ఒకే ఆవ‌రణ‌లో ఉన్న లేదా 250 మీట‌ర్ల దూరంలో ఉన్న ప్రైమ‌రీ స్కూళ్లలోని 3,4,5 త‌ర‌గ‌తులను హైస్కూలు ప్రధానోపాధ్యాయుల ప‌ర్యవేక్షణ‌లోకి తీసుకురానున్నారు.

About Author