ఆళ్ల నాని పార్థివ దేహానికి నివాళులర్పించిన ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు
1 min read
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి మంగళవారం గుండె గుండెపోటుతో మృతి చెందడం ఏలూరు ప్రజలకు జీర్ణించుకోలేని విషయం దానిలో భాగంగా శ్రీరామ్ నగర్ ఆయన నివాసంలో దివంగత శ్రీ ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) పార్థివ దేహాన్ని ఏపీ ఎన్జీవోస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ సందర్శించి నాని సోదరుని పరామర్శించి ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భాష్పాంజలి ఘటించారు. అలాగే వారికి ఉద్యోగుల అందరి తరపున ఘన నివాళి అర్పించి కుటుంబ సభ్యులకువారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నాయకులు హరినాథ్,సంఘ సభ్యులు పాల్గొన్నారు.


