NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ వారికి వెండి కిరీటం విరాళం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక సంకల్​ భాగ్​లో వెలిసిన శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం  నగరంలోని బోయ పద్మావతమ్మ దంపతులు అరకిలో వెండి కిరీటంను విరాళంగా అందజేశారు.  కర్నూలు నగర బ్రాహ్మణ  సంఘం అధ్యక్షుడు సండేల్​ చంద్ర శేఖర్​ కు  దాత పద్మావతమ్మ వెండి కిరీటాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా దేవాలయంలో దాత పద్మావతమ్మ పేరిట అర్చన చేసిన అర్చకులు… స్వామి వారికి వెండి కిరీటం అలంకరించారు. కార్యక్రమంలో కర్నూలు బ్రాహ్మణ సంఘం జనరల్​ సెక్రటరి నాగరాజు శర్మ, ఉప కార్యదర్శి సత్య నారాయణ రాజు, మేనేజర్​ రాధాకృష్ణ, పూజారి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

About Author