బిజెపి కేంద్రమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన చోడగిరి శ్రీనివాస్
1 min read
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఉద్యోగ బాధ్యతలు ఎన్నున్నా సంఘ సంక్షేమమే ముఖ్యమని భావించే వ్యక్తుల్లో ఒకే ఒక్కరు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షులు చోడగిరి ముందు వరసలో ఉంటారు. శ్రీనివాస్ ఢిల్లీఉద్యోగ భవన్ లో కేంద్ర ఉక్కు శాఖ మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిరువురు చిన్ననాటి బాల్య స్నేహితులన్న విషయం కొంతమందికే తెలుసు. రాజకీయ, ఉద్యోగ, సంఘ విషయాలు ఎన్ని చర్చించుకున్న ఇద్దరు కల్సి చిరు మందహాసంతో సరదాగా చిన్ననాటి తీపి గుర్తులను గడిపిన క్షణాలను నెమరు వేసుకున్నారు.