PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎరువుల దుకాణాల పై ఆకస్మిక తనిఖీ

1 min read

పల్లెవెలుగు వెబ్  మంత్రాలయం : మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఉన్న ఎరువుల దుకాణం పై వ్యవసాయ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆదివారం మాధవరం లో ఉన్న మారుతి ట్రేడర్స్ దుకాణం లో వ్యవసాయ శాఖ రాష్ట్ర తనిఖీ అధికారి శ్రీనివాసరావు, ఏడిఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎరువుల విలువ రూ 11,62,728 అని రకముల ఎరువుల మొత్తముగా 83.170 యంటిఎస్ నిల్వ లను సరైన పత్రాలు తనిఖీలు సమయంలో చూపించనందున ఎరువుల నిల్వలను అమ్ముటకు వీలులేకుండా నిలుపుదల చేయడం జరిగింది. అదేవిధంగా తాత్కాలిక సస్పెన్షన్  చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో వ్యవసాయ ఏడిఏ ఖాద్రీ, దస్తగిరి రెడ్డి, ఏఓ జీరా గణేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author