సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు సంతృప్తి గా ఉన్నారు.. మంత్రి
1 min read
నలుగురు పిల్లలు ఉన్నవారికి తల్లికి వందనం డబ్బులు అందాయి మంత్రి టీజీ భరత్
సమస్యలు తెలుసుకునేందుకే వార్డు పర్యటన: రాష్ట్ర మంత్రి టీజీ భరత్
ధర్మపేటలో పర్యటించిన మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు: క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వార్డు పర్యటన చేపట్టినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ తెలిపారు. నగరంలోని ధర్మపేటలో మంత్రి టీజీ భరత్ వార్డు పర్యటన చేపట్టారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు వెంటనే అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులకు వీటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే ప్రజల సమస్యలు తెలుస్తాయని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అధికారులను వెంటబెట్టుకుని అవకాశం ఉన్నప్పుడల్లా నగరంలో పర్యటిస్తున్నానని చెప్పారు. మురుగు కాలువలు, విద్యుత్ స్తంభాల సమస్యలు ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు. ఇళ్ల పట్టాల సమస్యలపై తగిన విధంగా ముందుకు వెళతామన్నారు. సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. ముగ్గురు, నలుగురు పిల్లలు ఉన్నవారికి అందరికి తల్లికి వందనం డబ్బులు అందాయని మహిళలు చెప్పారని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి విజన్లో భాగంగా నగరాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, వార్డు ఇన్చార్జీలు, అధికారులు, బూత్ ఇంఛార్జీలు పాల్గొన్నారు.