మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట
1 min read
నగరపాలక మేయర్ బి.వై. రామయ్య
27 తీర్మానాలకు స్థాయి సంఘం ఆమోదం
రూ.7.42 కోట్లతో అభివృద్ధి పనుల ఖర్చు గ్రీన్ సిగ్నల్
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు. శుక్రవారం నగరపాలక కార్యాలయంలో స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. మేయర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ యస్.రవీంద్ర బాబు, సభ్యులు, అధికారులు హాజరయ్యారు. మొత్తం 27 తీర్మానాలు, రూ.7.42 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్యక్రమంలో సభ్యులు జుబేర్, యూనూస్, విక్రంసింహా రెడ్డి, మిద్దె చిట్టెమ్మ, అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్ఓ జునైద్, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, ఇంచార్జ్ ఎస్ఈ శేషసాయి, తదితరులు పాల్గొన్నారు.
ఆమోదించిన తీర్మానాల్లో ముఖ్యమైనవి:
నగరంలో ప్రధాన కూడళ్లలో వార్నింగ్ సైన్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయుటకు రూ.49.00 లక్షలతో సాధారణ నిధుల నుండి ఖర్చు చేయుటకు తీసుకున్న ముందస్తు అనుమతి పొందిన అంశమును ధృవీకరించారు. దిగువ శ్రేణి సహాయకుల తుది సీనియారిటీ జాబితా ప్రకారం సబ్ ఆర్డినేట్ సర్వీసు రూల్స్ మేరకు అర్హత గల యం.డి.ఫరూఖ్, అహమ్మద్, టి.శ్రీనివాసులు, జి.సుహైల్ అహమ్మద్లను ఎగువ శ్రేణి సహాయకులుగా పదోన్నతి కల్పించేందు ఆమోదం తెలిపారు.4వ వార్డ్ కుమ్మరి వీధి నందు మేజర్ డ్రైన్ నిర్మాణానికి రూ.33.00 లక్షలు కేటాయింపు.7వ వార్డు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు డ్రైనేజీ కాలువ నిర్మాణానికి రూ.22 లక్షలు మంజూరు 8వ వార్డు పెద్దపడఖాన రూ.22 లక్షలతో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి ఆమోదం.12వ వార్డు అబ్రార్ కాంప్లెక్స్ వద్ద డ్రైనేజీ కాలువ, వడ్డేగిరి సంఘం కార్యాలయం వద్ద సిసి రహదారి నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయింపు 44వ వార్డు బాలాజీ బ్యాంగిల్స్ నందు రూ.17 లక్షలతో సిసి డ్రైన్ నిర్మాణానికి ఆమోదం.44వ వార్డులో మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీ పార్కు నందు రూ.24 లక్షలతో సిసి డ్రైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. 48వ వార్డు యన్.వి.ఆర్. హోటల్ వద్ద రూ.30.60 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణానికి పచ్చ జెండా ఊపారు.. 48వ వార్డు అమీర్ హైదర్ ఖాన్ నగర్ నందు రూ.37.60 లక్షలతో సిసి రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.