PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ వివేకా హత్యకేసు: సీబీఐ కస్టడీకి కీలక నిందితుడు

1 min read


పల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు శంకర్ రెడ్డిని సీబీఐ ఇటీవల హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిస సంగతి తెలిసిందే. తాజాగా శంకర్ రెడ్డిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను పులివెందుల కోర్టు విచారించింది. వాదనల అనంతరం శంకర్ రెడ్డిని 8 రోజుల సీబీఐ కస్టీడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం శంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు. దీంతో అతన్ని రేపటి నుంచి డిసెంబర్ 2 వరకు సీబీఐ విచారించి కీలక విషయాలు రాబట్టే అవకాశం ఉంది.

About Author