స్వర్గీయ రావు బహదూర్ శేషారెడ్డి 139 వ జయంతి వేడుకలు
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డిస్వర్గీయ రావు బహదూర్ శేషారెడ్డి 139 వ జయంతి సందర్భంగా డోన్ పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు ,ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి ,జడ్పిటిసి రాజకుమార్ , నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్ ,మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ,నియోజవర్గ యూత్ అధ్యక్షుడు రాజ వర్ధన్ ,దినేష్ గౌడ్ ,డోన్ మండలం అధ్యక్షులు సోమేష్ యాదవ్ ,పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి ,వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్ ,కౌన్సీలర్లు నాగేంద్ర మూర్తి ,ఆర్ట్ రమణ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

