PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటుకు రూ. 30 వేలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్‌ కూడా రాకపోయినా, ఎప్పుడు వెలువడుతుందో కూడా తెలియకపోయినా.. ప్రలోభాలు మాత్రం అప్పుడే భారీ స్థాయిలో జరుగుతున్నాయి. అధికార పార్టీ ఒక్కటే కాకుండా మూడు ప్రధాన పార్టీలూ ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల దాకా ఇస్తుందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఇలా టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌.. మూడు పార్టీల నుంచి కలిపి ఒక్కో ఓటుకు రూ.30 వేల వరకు అందుతాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో ఈ నియోజకవర్గానికి చెంది ఉండి, ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్న వారందరి దృష్టి ఇప్పుడు మునుగోడుపై పడింది. ఉప ఎన్నిక నేపథ్యంలో వారంతా మునుగోడు నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

                                        

About Author