శ్రీ శ్రీ జయలక్ష్మి మాత వారి దివ్య పాదుకులకు పంచామృత అభిషేకం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జయు గురుదత్త శ్రీ గురుదత్త శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మాతృమూర్తి మరియూ యోగ గురువు ఐన శ్రీ జయలక్ష్మి మాత జయంతి సందర్భంగా,శ్రీ శ్రీ జయలక్ష్మి మాత వారి దివ్య పాదుకులకు, పంచామృత అభిషేకం, షోడశోపచార పూజ విశేషంగా జరుపబడినది. మరియూ శుక్రవారం సందర్భంగా రాహుకాల,దుర్గాపూజ, శ్రీ లలితా సహస్రనామ పారాయణం విశేషంగా చేయడమైనది. ఈ పూజా కార్యక్రమమములో మాతృ మండలి సభ్యులు మరియూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అర్చనలు, వడిబియ్యం సమర్పణ చేసుకున్నారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదములు స్వీకరించి, అమ్మ కృపకు ప్రాత్రులైనారు. మరియూ ఆశ్రమ భక్తులు సి.ఏ. భరత్ వర్మ అర్చన ల దంపతులు సహకారంతో బాటసారులకు పులిహోర, పెరుగన్నము, త్రాగునీరు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో మాతృ మండలి సభ్యులు, టి. శ్రీదేవి , సిఏ. రాజేశ్వరి , డా.వై. నాగజ్యోతి పాల్గొన్నారు. ఆలయ ప్రెసిడెంట్ టి.ఎస్. రామకృష్ణ , ట్రస్ట్ సభ్యులు డిఆర్.సి ఆంజనేయులు , మరియూ డిఆర్.సి ఏ నగేష్ వర్మ పాల్గొని కార్యక్రమము జయప్రదం చేయడమైనది.