PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు :కర్నూలు జిల్లా నందికొట్కూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శుక్రవారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఎసిబి డీఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో  ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో అనధికారికంగా నిల్వ ఉన్న రూ,45,960 లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులను పరిశీలించారు.

20 మంది ప్రవేట్ స్టాంప్ రైటర్స్ ను ఆధీనంలోకి తీసుకొని విచారించారు. సబ్ రిజిస్టర్ చంద్రమౌళి నుంచి వివరాలు సేకరించారు. 19 రిజిస్ట్రేషన్ లో శుక్రవారం జరిగినట్లు సమాచారం. అందులో మాటిగేజి అయినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ఈ దాడులలో ఎసిబి సిఐ లు కృష్ణయ్య, కృష్ణ రెడ్డి, తేజేశ్వర రెడ్డి, సీతారామి రెడ్డి ,సిబ్బంది పాల్గొన్నారు.

About Author