PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

1 min read

– తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండల పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ, అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూతులను బుధవారం తనిఖీ చేసినట్లు తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్ తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మండల పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తూర్పు దిక్కున ఉన్న పట్టభద్రులకు సంబంధించిన 19వ పోలింగ్ బూతు ను అదేవిధంగా పడమర వైపున ఉన్న టీచర్స్ కు సంబంధించిన 15 వ పోలింగ్ బూతు ను అదేవిధంగా అక్కడ ఫర్నిచర్, లైటింగ్ నీటి వసతి సంబంధించిన పలు అంశాలను ఆయన పరిశీలించినట్లు తెలిపారు, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 11 వందల మంది పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి 67 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఆర్ ఐ, వీఆర్వోలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

About Author