PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పది ఫలితాల్లో టాపార్ గా ఆలూరు మనోజ్

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : కష్టపడి చదివి పదో తరగతి పరీక్షలు వ్రాసి న ప్యాపిలి పట్టణనికి చెందిన మనోజర్ టాపర్ గా స్థానం దక్కించుకున్నారు. ప్యాపిలి పట్టణంలోని హుసేనాపురం వీధికి చెందిన ఆలూరు వంశీ చౌదరి, సుహాసినిల దంపతుల కుమారుడు ఆలూరు మనోజ్ కుమార్ డోన్ పట్టణంలోని చైతన్య స్కూల్లో పదవ తరగతి చదువుతూ పరీక్షలు వ్రాసి, శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 600 మార్కులకు గాను 589 మార్కులతో సత్తా చాటాడు . ఈ సందర్భంగా మా కుమారుడు సాధించిన విజయానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయని, తమ కుమారుడికి స్వీట్లు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆలూరు మనోజ్ మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల స్ఫూర్తితో నానమ్మ వీరలక్ష్మి, పెదనాన్న వరుణ్ కుమార్, తల్లితండ్రులు కలలు కన్నా ఇంజనీర్ ఉద్యోగం భవిష్యత్తులో సాధించాలన్నది తన ధ్యేయమని పేర్కొన్నారు.

About Author