PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీకి..మరో తుఫాన్​ ముప్పు!

1 min read

పల్లెవెలుగువెబ్​, విశాఖపట్నం: ఏపీకి మరో తుఫాన్​ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే గులాబ్​ తుఫాన్​తో ఉత్తరాంధ్రా భారీవర్షాలకు అతలాకుతలమయింది. ఈ ఘటన మరువక ముందే మరో తుఫాన్​ జావద్​ పేరిట ఏపీవైపు దూసుకొస్తోంది. ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడి మరో రెండురోజుల్లో వాయుగుండంగా మారే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 13, 14తేదీల్లో తుఫాన్​గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.15న విశాఖ, తూర్పుగోదావరి మధ్య తీరం దాటొచ్చని పేర్కొంది. వాయుగుండంగా మారి ఏపీ, ఓడిసా సరిహద్దుల్లో భారినుంచి అతిభారీ వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది.

About Author