PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌సుపుకు ఏపీ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పసుపు పంటకు ఏపీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. 2022–23 సీజన్‌ కోసం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,850లుగా పేర్కొంది. రాష్ట్రంలో పసుపు 30,518 హెక్టార్లలో సాగవుతోంది. ఏటా 3.50 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో కనీస మద్దతు ధర దక్కకపోవడంతో 2019–20లో రూ.342.75 కోట్ల విలువైన 50,035 టన్నుల పసువును మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసింది. ఆ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు మంచి రేటు పలుకుతోంది. గడిచిన సీజన్‌లో రికార్డు స్థాయిలో క్వింటాల్‌ రూ.7,900కు పైగా పలికింది. ప్రస్తుతం క్వింటాల్‌ రూ.6,500కు పైగా పలుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో మార్కెట్‌లో పసుపునకు రేటు పెరిగే అవకాశం కన్పిస్తోంది.

                                    

About Author