NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యూపీ ఎన్నిక‌ల్లో ఏపీ డ‌బ్బు.. ఎవ‌రు పంపారు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ నేత లంకా దిన‌క‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించడానికి అఖిలేష్ యాదవ్‌కు ఏపీ పాలకుల నుంచి అవినీతి సొమ్ము పెద్ద ఏత్తున వెళ్లిందని అన్నారు. ఏపీలోని వైయస్సార్సీపీ నాయకుల ప్రోద్భలంతో తయారు అయ్యే మద్యం అఖిలేష్ యాదవ్ సహకారంతో యూపీలో అమ్మాలనే ప్రణాళిక పారలేదన్నారు. “ఏపీ అవినీతి సొమ్ము యూపీ ఏన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా వాడారు” అని చెప్పిన అనంతరం తేలు కుట్టిన పిల్లిలా వైయస్సార్సీపీ నాయకులు నిశబ్దంగా ఉన్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అవినీతి సొమ్ము వాడిన వారి బాగోతం బట్ట బయలు అయ్యిందన్నారు. అవినీతి పరుల కూటమి కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యారని లంకా దినకర్ ఆరోపించారు.

                                    

About Author