ఏరువాక పౌర్ణమి ఎద్దుల పండుగకు ఏర్పాట్లు
1 min read
హోళగుంద, న్యూస్ నేడు: హోళగుందలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న ఎద్దుల పండుగకు సర్పంచ్ రంగమ్మ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శివాజీ సర్కిల్ వరకు గ్రావెల్ వేసి రోడ్డును చదను చేశారు. పండుగకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ తెలిపారు.