PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘‘అస‌దుద్దీన్ ఓవైసీ పాండ‌వుల్లో ఒక‌రు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ శ‌కుని’’ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మ‌ధ్యప్రదేశ్ లో ఓ ఇంజినీర్ వింత‌వాద‌న తెర‌మీద‌కి తెచ్చారు. ప్రతి ఆదివారం త‌న‌కు డే ఆఫ్‌ కావాల‌ని ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అగ‌ర్ మ‌ల్వా జిల్లాలోని సంశేర్ జ‌న్ ప‌ద్ పంచాయ‌తీ చీఫ్ కు .. స‌బ్ ఇంజినీర్ రాజ్ కుమార్ యాద‌వ్ లేఖ రాశారు. ఆ లేఖ‌లో కొద్దిరోజుల క్రిత‌మే త‌న‌కు గ‌త జ‌న్మ గురించి తెలిసింద‌న్నారు. త‌న జీవిత ర‌హ‌స్యాన్ని క‌నుగొన‌డానికి, ఆత్మను శోధించ‌డానికి ఉప‌యోగ‌ప‌డేలా ప్రతి ఆదివారం సెల‌వు కావాల‌ని లేఖ‌లో కోరారు. త‌న గ‌త జ‌న్మలో ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ పాండ‌వుల్లో ఒక‌రైన న‌క‌లుడ‌ని, త‌న‌కు మంచి స్నేహితుడ‌ని రాజ్ కుమార్ యాద‌వ్ లేఖ‌లో పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌త్ శ‌కుని అని, త‌న గ‌త జ‌న్మ గురించి తెలిశాక‌.. త‌న జీవిత ర‌హ‌స్యం గురించి తెలుసుకోవాల‌నుకుంటున్నాన‌ని లేఖ‌లో చెప్పారు. ఈ లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

About Author