PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాకేష్ టికాయ‌త్ పై దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌ పై ఇంకు దాడి జరిగింది. బెంగళూరులో ప్రెస్ కాన్ఫ‌రెన్స్ ఏర్పాటు చేశారు. ప్రెస్‌మీట్ జరుగుతుండగా సుమారు డజను మంది అక్కడకు చేరుకుని టికాయత్‌పై ఇంక్ చల్లారు. దీంతో అక్కడ గందరగోళం తలెత్తింది. ఈ ఘటనకు స్థానిక పోలీసులదే బాధ్యతని టికాయత్ ఆరోపించారు. పోలీసులు తమకు ఎలాంటి భద్రతా కల్పించలేదన్నారు. రైతు నిరసనలకు చిక్కులు సృష్టించాలని కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వంతో పోలీసులు కుమ్మక్కయ్యారని అన్నారు. ఒక స్టింగ్ ఆపరేషన్‌లో రైతు నాయకుడు ఒకరు డబ్బు అడుగుతూ కెమెరాకు చిక్కారంటూ వచ్చిన ఆరోపణలపై మాట్లాడేందుకు టికాయత్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

                                             

About Author