PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేద ప్రజలకు అండగా …జగనన్న సురక్ష

1 min read

– జగనన్న సురక్ష… పేదవారి రక్ష.. జన సంక్షేమమే..జన బాంధవుడి ధ్యేయం

– కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ రోజు కర్నూలు నగరం లోని 43వ వార్డ్ 112వ సచివాలయలలో నిర్వహించబడిన జగనన్న సురక్ష కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పలువురు లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో గౌరవ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు మరింత చేరువుగా వారి కష్టాన్ని తీర్చుటకు సచివాలయలను పెట్టిన 100 కి  95 శాతం పూర్తి అవుతున్న ఇంకా ఆ పేద బడుగు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు,సర్టిఫికేట్ లు అందని వారికి మరింత మంచిని చేయాలనే లక్ష్యంతో సచివాలయంకి లబ్దిదారులు వారి సమస్యలు చెప్పుకోలేని ఇంకా ఉన్నారేమో అని గ్రహించి ప్రజలకు మరింత చేరువ చేయాలనే ధ్యేయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని పేర్కొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, వైస్సార్ ఆరోగ్య శ్రీ, రైస్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్… అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ ,వార్డ్ ఇంచార్జిలు,స్పెషల్ ఆఫీసర్, సచివాలయం సిబ్బంది, సచివాలయం కన్వీనర్లు,పార్టీ ముఖ్య నాయకులు మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Author