చెట్నిహల్లిలో మాదిగల ఇళ్ళ ముందు శవాలను పూడ్చడం ఆపాలి
1 min read
కంచె వేయడంలో మాదిగలకు అన్యాయం జరిగితే” రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు నాంది పలుకుతాం
జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ
మంత్రాలయం , న్యూస్ నేడు : మండల పరిధిలోని చెట్నిహల్లి గ్రామంలో మాదిగల ఇళ్ళ ముందు శవాలను అక్రమంగా పూడ్చడం ఆపాలని కంచేవేయడం లో మాదిగలకు అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని జైభీమ్ ఎమర్పియస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ హెచ్చరించారు. ఆదివారం స్థానిక ఓ ప్రైవేటు వసతి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్నహళ్లి గ్రామ సర్వే నంబర్ 113, 114 లో 2.82ఎకరములు, ప్రస్తుతం 1 ఎకరం పైనే మాదిగలు ఇల్లు ముందున్న ఎస్సీ ల్యాండ్ సీలింగ్ (రస్తా పరంపోగు) భూమిని మాదిగలు గడ్డివాములు, ఇళ్ళు కట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారని తెలిపారు. అన్ని కులాలు చనిపోతే అక్రమంగా ఇక్కడే పూడ్చేవారని మాదిగలు ఇళ్ల ముందే శవాలను పూడ్చడం వల్ల అపరిశుభ్రత ఏర్పడి,మాదిగలు ఎంతో అనారోగ్యానికి గురవుతుంటే, 2018 సంవత్సరం నుండి ఎన్నో ఉద్యమాలు చేస్తే అప్పట్లో ఉన్న మండల అధికారులు గ్రామ సర్వేనెంబర్ 125,126 = 3.54 సెంట్లు భూమిని స్మశాన వాటికని గ్రామ మొత్తానికి ప్రభుత్వం కేటాయించడం జరిగిందని తెలిపారు. అప్పటినుంచి గౌడ్స్, లింగాయుతులు, బ్రాహ్మణులు వైశ్యులు కులాల వారు నేటికీ అక్కడే పూడ్చుకుంటూ ఉన్నారని కానీ బోయ, కురువ, బెస్త, వడ్ల ఇంకా కొన్ని బిసి కులాలు వారు అక్రమంగా కుల అహంకారంతో మాదిగలను అణిచివేయాలని 113, 114 సర్వే నంబర్ లోనే పూడుస్తూ, అవసరమైతే మాదిగలు ఇళ్ల కడుపు మొద్దులకే పూడ్చి, ఇళ్ళ ముందే పుర్రెలు, ఎముకలు,మనిషి కళేబరాలు పడేసి వెళ్తూ ఉన్నారని తెలిపారు. అయితే గత 6 నెలలు నుండీ ప్రభుత్వం కల్పించిన 125,126 సర్వే నంబర్ లో ఉన్న స్మశాన వాటికకు రోడ్డు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని పలుమార్లు కర్నూలు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలు అందజేస్తే,45 లక్షల రూపాయలు మంజూరు చేసి, రోడ్డు వేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని. తెలిపారు. పలుమార్లు ఆదోని సబ్ కలెక్టర్ ఇరువర్గాలతో చర్చలు జరిపి, న్యాయం చేస్తామని తెలపగా, చర్చలు అన్ని విఫలం అవుతున్నాయి. అయితే శనివారం మాదిగల ఇళ్ళ ముందు అక్రమంగా పూడుస్తున్న భూమికి కంచ వేయాలని జిల్లా అధికారులు వస్తే ఆ పనులకు బీసీ సామాజిక వర్గం అడ్డు చెప్పడం జరిగిందని. తెలిపారు. గ్రామంలో 144 సెక్షన్ ఉన్నప్పటికైన బీసీలను గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు అధికారులు రప్పించుకుంటున్నారని దళితులను మాత్రం రోడ్ల మీదకు రానివ్వడం లేదన్నారు. మాదిగలు ఇళ్ళ మీదకు బిసి వాళ్లు దాడులు చేస్తున్నప్పటికైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడంలో కూడా జిల్లా పోలీసు అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. .ఏదేమనప్పటికీ చెట్నహళ్లి గ్రామ మాదిగలు రికార్డు పరంగా,చట్టపరంగా శాంతియుతంగా ఉన్నప్పటికీ జిల్లా రెవెన్యూ,పోలీసు అధికారులు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని తెలిపారు. గ్రామస్తులతో మాట్లాడి, గ్రామంలో బీసీ సామాజిక వర్గం నేటికీ అల్లర్లు సృష్టించినప్పటికీ జిల్లా పోలీస్ అధికారులు చూసి చూడనట్లు పోతున్నారని తెలిపారు. ఇది కేవలం దళితులు మీద కుల వివక్షత ప్రభుత్వమే చూపిస్తుందనేలాగ నిరూపణ అవుతుందని. తెలిపారు. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ,పోలీస్ అధికారులు మరింత జోక్యం చేసుకొని దళితులకు వివక్షత జరగకుండా తక్షణమే రెవెన్యూ రికార్డు ప్రకారం 113,114 సర్వే నెంబర్లు రస్తా పరంబోకు, మాదిగల ఇళ్లని ఉన్నాయి . కాబట్టి ఆ భూమి మొత్తానికి కంచవేసి, సర్వే నంబర్ 125 126 = 3.54 ఎకరుములలో ప్రస్తుతానికి 84 సెంట్లు ప్రభుత్వం శుభ్రం చేసి ఉన్నారని తెలిపారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే 125,126 సర్వే నెంబర్ స్థలంలోనే ఖననం చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే రెండు మూడు రోజుల్లో చలో అమరావతి, చలో కలెక్టర్ ఆఫీస్,చలో చట్నాహళ్లికు పిలుపునిచ్చి రాష్ట్ర ఉద్యమాలకు నాంది పలికి, మంత్రాలయం నియోజకవర్గ రాజకీయ నాయకులు జిల్లా, డివిజన్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మాదిగల ఇళ్ల ముందే శవాలను అక్రమంగా పూడ్చాలని హుకుం జారీ చేస్తూ, ఎస్సీ ఎస్టీ కేసులను కాకుండా ఆపుతున్నారు.ఈ రాజకీయ నాయకులు గూర్చి రాష్ట్రానికి తెలిసే విధంగా ఎండగట్టి, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో, జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో మాదిగల సత్తా అంటే ఏమో ఓటుతో బుద్ధి చెబుతామని మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ, జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాదిగరత్నం,జై భీమ్ ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి సంఘటి యోహాను మాదిగ, జై భీమ్ ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గ నాయకులు దేవరపాట అనిల్ కుమార్,మారెన్న,నాగేంద్ర జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం మండల అధ్యక్షుడు గాడిమోడి నరసింహులు మాదిగ తదితరులు పాల్గొన్నారు.