PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్టీ మార్పు ప్ర‌చారం పై బైరెడ్డి స్పంద‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పార్టీ మారుతున్నార‌న్న ప్ర‌చారం పై వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి స్పందించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమదని, తాను ఎప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విధేయుడినేనని శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్ప‌ష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమైనవని అన్నారు. తాను వైసీపీకి వీర సైనికుడినని, తనకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నందికొట్కూరు పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు, శాప్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చారన్నారు. తనకు ఇంత చేసిన పార్టీని తానెందుకు వీడుతానని, మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలన్నారు.

                                   

About Author