NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌డ‌ప జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌డ‌ప జిల్లాలోని బద్వేలు పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గంజాయి అక్రమ రవాణాతో పాటు.. విక్రయాలు సాగిస్తున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన 5 మందితో పాటు, అనకాపల్లికి చెందిన ఇద్దరు, ఇద్దరు కడప జిల్లాకు చెందిన వారుగా విచారణలో వెల్లడైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుండి గంజాయిని తీసుకుచ్చి ముఠా సభ్యులు ఇక్కడ విక్రయిస్తున్నారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరి వద్ద నుండి 10 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

                                      

About Author