పాలకుర్తి వాసికి.. సీఎంఆర్ ఎఫ్ మంజూరు
1 min read
లక్ష రూపాయల చెక్కు అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి
కోడుమూరు, న్యూస్ నేడు :కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన సానియా తండ్రి మునీర్ కి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కోడుమూరు ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి రూ.1,08968 రూపాయల చెక్కును మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సానియా తండ్రి మునీర్ మాట్లాడుతూ తమ ఆర్థిక పరిస్థితి బాలేక హాస్పిటల్ లో అప్పు చేసి ట్రీట్మెంట్ తీసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆర్థిక పరిస్థితిని ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోవాలని విన్నవించారు. ఎమ్మెల్యే సూచనతో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా మాకు లక్ష ఎనిమిది వేల తొమ్మిది అరవై ఎనిమిది రూపాయలు చెక్కు మంజూరైందని, ఆ చెక్కును ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అందజేసినట్లు బాధితులు మునీర్ వెల్లడించారు. తమకు సహాయం చేసిన ఎంఎల్ఏ బొగ్గుల దస్తరి , సిఎం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం సీనియర్ నాయకులు విష్ణువర్థన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.