కూటమి ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు
1 min read
న్యూస్ నేడు ఆలూరు: ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షా పట్టుదలతో ఆయన ఆధ్వర్యంలో అలాగేయువనేత శ్రీ.నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర ద్వారా మనరాష్ట్ర ప్రజల ఆశీస్సులతో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా., బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆలూరు తాలూకా టిడిపి ఇంచార్జి బి.వీరభధ్రగౌడ్ ఆధ్వర్యంలో కూటమినాయకులు కార్యకర్తలు ఆలూరు పట్టణం లో భారీఎత్తున ద్విచక్రవాహన విజయోత్సవ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఇంచార్జి వర్యుల చేతుల మీదుగా టిడిపి ఆఫీసు దగ్గర బైక్ ర్యాలీ ప్రారంబై దాదాపు 300వందల ద్విచక్ర వాహనాలతో ఆలూరు పట్టణం మొత్తం ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆలూరు తాలూకా టిడిపి ఆఫీసు ముందు కార్యకర్తలు, నాయకుల మధ్య కేక్ కట్చేసి పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు.అలాగే ఇంచార్జి వర్యులు మీడియాతో మాట్లాడుతూ గతంలో జగన్ రాక్షసపాలనకు చరమగీతం పాడి టిడిపి కూటమి గెలుపుకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ ఆరుమండలాల టిడిపి జనసేన , బిజెపికూటమి ప్రభుత్వ నేతలు కార్యకర్తలు, టిడిపి కన్వీనర్లు, క్లస్టర్,బూత్,యూనిట్ ఇంఛార్జిలు, టిడిపి సర్పంచ్ లు, ఎంపీటీసిలు , జెడ్పిటిసిలు ఎంపీపీ లు,వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర,జిల్లా మరియుతాలూకా స్థాయి ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అలాగే తెలుగు యువత, ఐటిడిపి,టిఎన్ఎస్ఎఫ్, టిఎన్టియుసి, టిడిపి శోషల్ మీడియా, మహిళా సంఘాలు అలాగే టిడిపి అనుబంధ సంఘాల పసుపు సైనికులు, కార్యకర్తలు అందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.