యోగాతో సంపూర్ణ ఆరోగ్యం…
1 min read
ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు
చెన్నూరు ,న్యూస్ నేడు: వివిధ వయసుల వారికి యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందనిఎంపీడీవో కిరణ్ మోహన్ రావు అన్నారు. శనివారం యోగా దినోత్సవం యోగాంధ్ర మాక్ డ్రిల్ లో భాగంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో యోగాంధ్ర మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బందితో ఉదయం 7 గంటల నుండి ఎనిమిది గంటల వరకు యోగాంధ్ర మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధి హామీ కూలీలకు యోగాతో వచ్చే ప్రయోజనాలు, ఆరోగ్య సంబంధిత విషయాలు గురించి ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు వివరించడం జరిగింది. అలాగే మండలంలోని రామన పల్లె గ్రామం పంచాయతీలో కార్యదర్శి గురువేశ్వరరావు ఆధ్వర్యంలో యోగాంధ్ర మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో అన్ని వయసుల పాల్గొని యోగా గురించి, యోగాతో మానసిక రుగ్మతలు ఏ విధంగా తొలగించుకోవచ్చో తెలుసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా జియోటాగ్ తో అనుసంధానం చేయడం జరుగుతుందని ఎంపీడీవో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఉపాధి కూలీలు, పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.