NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిసిఎంఎస్​  చైర్మన్ శ్రీ వై.నాగేశ్వరరావు యాదవ్  ప్రమాణస్వీకారం

1 min read

ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన  శ్రీ.బి.వీరభద్ర గౌడ్

న్యూస్ నేడు ఆలూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి కర్నూలు జిల్లా (కర్నూలు, నంద్యాల) మార్కెటింగ్ సొసైటి డిసీఎంఎస్​  చైర్మన్ గా శవై.నాగేశ్వరరావు యాదవ్ నియమించడం జరిగింది.ఇందులో భాగంగా నంద్యాల వ్యవసాయమార్కెట్ యార్డ్ నందు  ఆయన పదవి ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.ఈకార్యక్రమానికి మన ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బి. వీరభద్రగౌడ్  కూడా హాజరై వారికి పదవీ ప్రమాణ స్వీకార  శుభాకాంక్షలు తెలిపారు.  ఈకార్యక్రమానికి  రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు బి.సి.జనార్దన్ రెడ్డి  అలాగే రాష్ట్ర చట్టం న్యాయ,మైనార్టీ శాఖ మాత్యులు ఎన్​ఎండి ఫరూక్ * ,పెద్దలు డోన్ నియోజకవర్గ శాసన సభ్యులు .కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ,కర్నూలు ఎంపీ బస్తిపాటి.నాగరాజు , ఎమ్మెల్సీ .బిటి నాయుడు , కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు ని.తిక్కారెడ్డి ,నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ,కర్నూలు జిల్లా కెడిసిసి చైర్మన్ కోడుమూరు విష్ణువర్ధన్ రెడ్డి ,రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ ,రాష్ట్ర కరువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ,సీనియర్ నాయకులు భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ,ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం .సుబ్బారెడ్డి ,కర్నూలు జిల్లా బిసి ఫెడరేషన్ అధ్యక్షులు సత్రం రామ కృష్ణుడు ,ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ బత్తిన వెంకతరాముడు  అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఇతర ముఖ్య నాయకులు ఆయా నియోజక వర్గాల పార్టీ ఇంచార్జీలు,రాష్ట్ర/జిల్లా స్థాయి చైర్మన్లు వివిధ హోదాలలో ఉన్న ఇతర ముఖ్య నాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *