NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెద్ద ఎత్తున శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి సేవలో భక్తులు 

1 min read

స్వామివారిని దర్శించుకున్న జిల్లా పంచాయతీ అధికారిణి కె.అనురాధ

వివిధ సేవల రూపేణ రూ:1,99,207/- లు ఆదాయం

నిత్య అన్నదాన సత్రంలో 1000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ

ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు

కార్యనిర్వాహణాధికారిణి ఆర్.వి.చందన

ఏలూరుజిల్లా ప్రతినిధి  న్యూస్​ నేడు: గురవాయిగూడెం గ్రామములో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయమువద్ద  ప్రీతికరమైన మంగళవారం నాడు నిర్వహించు సుప్రభాత సేవ, అభిషేక సేవ,నిత్యార్చన, పూజలు ఏర్పాటు చేశారు. స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల హనుమద్ నామస్మరణతో ఆలయం మారు మ్రోగింది. జిల్లా పంచాయతీ అధికారిణి కె.అనురాధ స్వామివారిని దర్శించుకున్నారు.వేద పండితులు,అర్చకులు వేద ఆశీర్వచనంతో శేష వస్త్రములు,ప్రసాదాలు అందించారు. ప్రీతికరమైన మంగళవారం కావడంతో అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య  శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందించారు. మద్యాహ్నం  వరకు  దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ,విరాళాల  ద్వారా   రూ 1,99,207/-లు  సమకూరినది. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1000 మంది భక్తులు  అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీస్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా జే కృష్ణ పర్యవేక్షణలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి. చందన ఒక ప్రకటనలో తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *