PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా త‌ల్లి చ‌నిపోయినా చూడ‌టానికి రాలేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి రాజ్ భవన్‌లో చనిపోయినప్పుడు సీఎం కేసీఆర్‌ చూడడానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవహారాలపై ప్రదాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ కేసు, అవినీతిపై మోదీ, అమిత్‌షాలకు నివేదిక ఇచ్చానని తెలిపారు. డ్రగ్స్‌తో యువత నాశనం అవుతున్నారని, ఓ తల్లిగా బాధపడుతూ మోదీకి నివేదిక ఇచ్చానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ని ఒక అన్నగా భావించానని తెలిపారు. గవర్నర్లతో విభేదించిన ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, మమత ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచే వారని గుర్తుచేశారు. తెలంగాణలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.

                                               

About Author