PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

400 హైజిన్ కిట్ల పంపిణీ

1 min read

– కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇషాక్ బాష
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల : నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల ఆధ్వర్యంలో 400 మంది మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బందికి నంద్యాల శాసనసభ్యులు శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి చేతుల మీదుగా హైజిన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. నంద్యాల మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి సభాధ్యక్షత వహించిగా కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్మన్ షేక్ మాబున్నిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతూ నంద్యాల మునిసిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ సిబ్బందికి చాలా విలువైన హైజిన్ కిట్లు అందజేసిన రెడ్ క్రాస్ సంస్థను అభినందించారు, అలాగే రాష్ట్రంలోనే మన నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ కు మంచి పేరు వచ్చేలా నా వంతుగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని, రెడ్ క్రాస్ కు ఎల్లవేళలా అండగా ఉంటానని రెడ్ క్రాస్ సంస్థకు అన్నిరకాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.ఎమ్మెల్సీ ఇసాక్ భాష, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మబున్నిసా మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా కారంటైన్ సెంటర్లలో పలుచోట్ల మన రెడ్ క్రాస్ వాళ్ళు అత్యుత్తమ సేవలు అందించారని , ఈరోజు మన జిల్లాకు ఒక నూతన కమిటీ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఈ కమిటీకి అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆహ్వానం మేరకు హైజిన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవి గారికి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా గారికి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మబన్నీసా గారిని రెడ్ క్రాస్ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఇంకా ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కోశాధికారి నాగేశ్వరరావు , సీనియర్ నాయకులు నాగేశ్వర్రెడ్డి, కమిటీ సభ్యులు ఉస్మాన్ భాష, యాకోబు, మద్దిలేటి, నాగ సురేంద్ర , నాగరాజు , పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, రెడ్ క్రాస్ సభ్యులు నాగరాజు, శ్రీనివాసులు, నయీం, డిపిఓ రాజు నాయక్ తదితరులు కూడా పాల్గొన్నారు.

About Author