PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐదుగురి బధిరులకు టచ్​ఫోన్స్​ పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : దివ్యాంగులు, బధిరులు, వృద్ధులు, వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జాయింట్​ కలెక్టర్​ ( ఆసరా మరియు సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు. శుక్రవారం కర్నూలు కలెక్టర్​లోని జేసీ ఛాంబరులో దివ్యాంగులు, బధిరులు, వయోవృద్ధుల శాఖ ఏడీ విజయ నేతృత్వంలో అవసరమైన ఐదుగురి బధిరులకు జాయింట్​ కలెక్టర్​ ఎంకేవీ శ్రీనివాసులు టచ్​ఫోన్స్​ అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్హులై ఉండి.. పథకాలు వర్తించని వృద్ధులు, దివ్యాంగులు, బధిరులు ఎవరైనా ఉంటే.. వెంటనే ఏడీ విజయ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

About Author