PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాదాసి,మాదారి కురువలను ‘ఎస్సీ’లో చేర్చొద్దు..

1 min read

జీఓనం 53ను ఉపసంహరించుకోవాలని డిమాండ్​

పల్లెవెలుగు వెబ్​,  కర్నూలు: మాదాసి, మాదారి కురువలను ఎస్సీ జాబితాలో చేరుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ఎంఎస్​నం.53ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్​ చేశారు దండు వీరయ్య. శనివారం కర్నూలులోని అంబేద్కర్ భవన్ నందు సుభాకర్ ఆధ్వర్యంలో  రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా  దండు  వీరయ్య,  జయరాజు (అడ్వకేట్), వైసీపీ నాయకులు  మద్దయ్య , టీడీపీ నాయకులు జేమ్స్ , కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి  కరుణాకర్  కర్నూలు జిల్లా INTUC అధ్యక్షులు  బతుకన్న,  INTUC అధికార ప్రతినిధి  సుంకన్న, MRPS నాయకులు సోమసుందర్ , ఉద్యోగ సంఘం AP S.C welfare Association state vice president G. నాగరాజు D.E.E ,  మద్దూరి.వెంకటస్వామి M&H dept, అడ్వకేట్ చంద్రుడు , వివిధ S.C సంఘాల నాయకులు  పాల్గొనడం జరిగింది.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదాసి, మాధారీ కురువ కులాలను  S.C కులాల జాబితాలో నుంచి ఉపసంహరించుకునేంత వరకు వివిధ రూపాలలో రాష్ట్ర,జిల్లా ల వ్యాప్తంగా AP S.C కులాల రిజర్వేషన్  పరిరక్షణ పోరాట సమితి( JAC) ఏర్పాటు చేసి  పోరాటము చేయాలని పిలుపునిచ్చారు.

About Author