PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘గుడికో గోమాత’ కింద…టీటీడీ ఆధ్వర్యంలో గోవులు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాల నుండి గుడికో గోమాత పథకంక్రింద శుక్రవారం గోవత్ససహితంగా మూడు గోవులను ఆర్.పాంపల్లి, సుద్దమల్ల, కోటకందుకూరు గ్రామాల దేవాలయాలకు అందించారు. కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే ధర్మాచార్యులు టి.వి.వీరాంజనేయరావు, డాక్టర్ బోలుగద్దె అనిల్ కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ వి.మహేశ్వరరావు, గోశాల సిబ్బంది సుబ్రహ్మణ్యంరాజు, మట్టా సుబ్రహ్మణ్యంరెడ్డి,వెంకట సుబ్బానాయుడు ,పి.రాజన్న, ఆర్.పాంపల్లి సర్పంచ్ లక్ష్మీ దేవి, సుద్దమల్ల సర్పంచ్ మారంరెడ్డి రామమద్దిలేటి రెడ్డి,కోటకందుకూరు సర్పంచ్ దాదాపీర్, అర్చకులు మోహన్ శర్మ ,సమరసత సేవా ఫౌండేషన్ ప్రచారకులు వెంకటనరసయ్య, భూమా శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author