NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. పి .దస్తగిరి రెడ్డికి వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డు

1 min read

– గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్
పల్లెవెలుగు,వెబ్​ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహించే వైయస్సార్ అచీవ్మెంట్ పురస్కారాన్ని గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పి దస్తగిరి రెడ్డి గారు విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర గవర్నర్ మాన్యశ్రీ విశ్వ భూషణ్ హరి చందన్ గారు, వైయస్సార్ సతీమణి శ్రీమతి విజయమ్మ గారి సమక్షంలో పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. మా గౌరవ చైర్మన్ గారు, బ్యాంకింగ్ మరియు విద్యా రంగంలో చేసిన కృషిగాను ఈ ప్రతిష్టాత్మ పురస్కారాన్ని అందుకున్నారు.

About Author