ట్రాఫిక్ నియంత్రణకై డ్రోన్ కెమెరాను వితరణ చేసిన డివిఆర్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి. వెంకటేశ్వర్ రెడ్డి ట్రాఫిక్ నియంత్రణకు తన వంతు సహాయంగా డీజే డ్రోన్ కెమెరాను అందజేశారు .ఈ కార్యక్రమంలో డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్ కే మహేష్, మాజీ కార్పొరేటర్ సురేంద్ర తోపాటు డిఎస్పి బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్… డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్ కే మహేష్ లకు మెమొంటో అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి. వెంకటేశ్వర్ రెడ్డి ,జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ మాట్లాడుతూ కర్నూల్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ను నియత్రించేందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తెలిపారు .ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి పోలీసు యంత్రాంగానికి సహకరించాలని వారు సూచించారు.